దసరాకు ముందే పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న షా

ABN , First Publish Date - 2020-10-02T04:13:21+05:30 IST

కోల్‌కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా దసరాకు ముందే కోల్‌కతా వెళ్లనున్నారు. అక్టోబర్ 22 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.

దసరాకు ముందే పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న షా

కోల్‌కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా దసరాకు ముందే కోల్‌కతా వెళ్లనున్నారు. అక్టోబర్ 22 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. 2021లో జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన కోల్‌కతా పర్యటనలో ప్రారంభించే అవకాశాలున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. షా ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఇంటి నుంచే ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

Updated Date - 2020-10-02T04:13:21+05:30 IST