వచ్చే నెల హైదరాబాద్‌కు అమిత్‌షా

ABN , First Publish Date - 2020-02-20T10:05:54+05:30 IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మార్చి 14 లేదా 15న హైదరాబాద్‌కు రానున్నారు. సీఏఏకు మద్దతుగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న

వచ్చే నెల హైదరాబాద్‌కు అమిత్‌షా

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మార్చి 14 లేదా 15న హైదరాబాద్‌కు రానున్నారు. సీఏఏకు మద్దతుగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. సీఏఏ అమలులో మత వివక్ష తగదంటూ రాష్ట్ర కేబినెట్‌ తీర్మానం చేసిన నేపథ్యంలో అమిత్‌షా ఇక్కడే సీఏఏకు మద్దతుగా సభకు హాజరవబోతుండటం ఆసక్తికరంగా మారింది. అమిత్‌షా పర్యటన ఖరారైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌ పాల్గొంటారని సమాచారం. 

Updated Date - 2020-02-20T10:05:54+05:30 IST