గుర్తు తెలియని వాహనం ఢీ - ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-05-23T05:09:00+05:30 IST

రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దరిశ నర సింహులు (55) మృతి చెందాడు.

గుర్తు తెలియని వాహనం ఢీ - ఒకరి మృతి
క్షతగాత్రుడి వద్ద రోదిస్తున్న బంధువులు

బ్రహ్మంగారి మఠం, మే 22: రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దరిశ నర సింహులు (55) మృతి చెందాడు. బద్యేలు పట్టణం సూర్యపల్లెకు చెందిన నరసింహులు ఆదివారం పెం చలకోనకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బ్రహ్మం గారి మఠం మండలం రేకులకుంటలోని తన కూ తురి ఇంటికి వెళుతూ మఽధ్యాహ్నం రోడ్డు దాటు తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీం తో తీవ్రగాయాలపాలై రోడ్డు పక్కన పడిపోయిన విషయాన్ని స్థానికులు తెలపడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.


Updated Date - 2022-05-23T05:09:00+05:30 IST