రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-06T05:25:39+05:30 IST

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

కూర్మన్నపాలెం, మే 5: దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి... రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి తెల్లని పూల చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ కె.భుజంగరావు 9440057520 నంబరుకు ఫోన్‌ చేయాలని కోరారు.

Updated Date - 2021-05-06T05:25:39+05:30 IST