‘నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వీడాలి’

ABN , First Publish Date - 2022-01-29T04:52:03+05:30 IST

వైసీపీ ప్రభుత్వం మూడేళ్లు కావస్తున్నా నిరుద్యోగ యువతను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని పీడీఎస్‌యూ పట్టణ కార్యదర్శి శివ అన్నారు.

‘నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వీడాలి’

ఎమ్మిగనూరు, జనవరి 28: వైసీపీ ప్రభుత్వం మూడేళ్లు కావస్తున్నా నిరుద్యోగ యువతను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని పీడీఎస్‌యూ పట్టణ కార్యదర్శి శివ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సమ యంలో నిరుద్యోగులకు 2.35లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా నోటిఫికేషన్లు విడుదల చేయలేదని అన్నారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాన్నారు. ఈ సమావేశంలో నాయకులు నవీన్‌, రాజు, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T04:52:03+05:30 IST