వలంటీర్లతో నిరుద్యోగం తగ్గదు
ABN , First Publish Date - 2021-11-11T16:59:48+05:30 IST
వలంటీర్ పోస్టులతో..
అశోక్ బాబు
అమరావతి(ఆంధ్రజ్యోతి): వలంటీర్ పోస్టులతో రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గి ఉంటే ఒక్క ఏడాదిలో 385 నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు బుధవారం ఒక ప్రకటన చేశారు. ‘‘చంద్రబాబు దిగిపోయే సమయంలో రాష్ట్రంలో నిరుద్యోగం 4 శాతం ఉంది. పోయిన ఏడాది ఏప్రిల్ నాటికి అది ఏకంగా 20 శాతానికి పెరిగింది. జగన్రెడ్డి చేతగానితనం దీనికి కారణం. రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, తాను రాగానే వాటిని భర్తీ చేస్తానని జగన్ రెడ్డి చెప్పారు. మూడేళ్లయినా ఇంతవరకూ ఒక్క నోటిఫికేషన్ విడుదల కాలేదు. రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. పైగా ఉన్న పరిశ్రమలను కూడా పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. అందుకే నిరుద్యోగం పెరుగుతోంది’’ అని అశోక్బాబు పేర్కొన్నారు.