కవ్వాలలో పక్షుల గణనపై అవగాహన

ABN , First Publish Date - 2022-10-07T04:55:43+05:30 IST

కవ్వాల టైగర్‌ జోన్‌లో గురువారం పక్షుల గణనపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఎఫ్‌డీవో మాధవరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పక్షుల గుర్తింపు, వాటిని గణించే పద్ధతిపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

కవ్వాలలో పక్షుల గణనపై అవగాహన
బర్డ్‌ వాచ్‌లో పక్షుల గణన చేస్తున్న అటవీ శాఖ సిబ్బంది

జన్నారం, అక్టోబరు 6: కవ్వాల టైగర్‌ జోన్‌లో  గురువారం పక్షుల గణనపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఎఫ్‌డీవో మాధవరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పక్షుల గుర్తింపు, వాటిని గణించే పద్ధతిపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఇందన్‌పల్లి రేంజ్‌లోని కల్పకుంట, మైసమ్మకుంట, జన్నారం రేంజ్‌లోని బైసన్‌కుంట వద్ద అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎఫ్‌ఆర్‌వో హఫీజొద్దీన్‌, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T04:55:43+05:30 IST