సఫారీ గ్రూప్లో భారత్
ABN , First Publish Date - 2021-11-18T09:53:16+05:30 IST
వెస్టిండీస్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి వరకు జరిగే ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచక్పలో దక్షిణాఫ్రికా, ఉగాండా,
- అండర్-19 వరల్డ్కప్
దుబాయ్: వెస్టిండీస్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి వరకు జరిగే ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచక్పలో దక్షిణాఫ్రికా, ఉగాండా, ఐర్లాండ్ జట్లతో కలిసి గ్రూప్-బిలో భారత్కు చోటు దక్కింది. మొత్తం 16 జట్లు పోటీపడే ఈ మెగా ఈవెంట్లో గ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంప్ బంగ్లాదేశ్, ఇంగ్లండ్, కెనడా, యూఏ ఈ.. గ్రూప్-సి తరఫున పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, జింబాబ్వే, పపువా న్యూ గినీ.. గ్రూప్-డిలో విండీస్, ఆస్ట్రేలియా, శ్రీలం క, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఫైనల్ ఫిబ్రవరి 5న జరగనుంది.