క్షతగాత్రుడికి ఎమ్మెల్యే ప్రథమ చికిత్స

ABN , First Publish Date - 2020-08-07T14:20:03+05:30 IST

బ్రాహ్మణపల్లి జడ్పీ పాఠశాల సమీపంలో గురువారం సాయంత్రం ద్విచక్రవాహనాన్ని..

క్షతగాత్రుడికి ఎమ్మెల్యే ప్రథమ చికిత్స

పిడుగురాళ్ల(గుంటూరు): బ్రాహ్మణపల్లి జడ్పీ పాఠశాల సమీపంలో గురువారం సాయంత్రం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన సురేష్‌కు తీవ్రగాయాలై స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కారు దిగి వచ్చి క్షతగాత్రుని నాడి పరీక్షించి ప్రథమ చికిత్స అందించి ప్రైవేటు వైద్యశాలకు తరలించే ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-08-07T14:20:03+05:30 IST