పాక్ భూ భాగంపై భారత మిస్సైల్

ABN , First Publish Date - 2022-03-11T19:15:31+05:30 IST

భారత్‌కు చెందిన నిరాయుధ క్షిపణి ఒకటి తమ భూభాగంపై పడిందని పాకిస్తాన్ ఆరోపించింది. బుధవారం సాయంత్రం భారత్‌లోని సిర్సా (హరియాణా) వైపు నుంచి ఒక సూపర్‌సోనిక్ క్షిపణి, పంజాబ్ ప్రాంతంలోని మియాన్ చన్ను అనే ప్రాంతంలో పడినట్లు పాక్ ఆర్మీ తెలిపింది.

పాక్ భూ భాగంపై భారత మిస్సైల్

భారత్‌కు చెందిన నిరాయుధ క్షిపణి ఒకటి తమ భూభాగంపై పడిందని పాకిస్తాన్ ఆరోపించింది. బుధవారం సాయంత్రం భారత్‌లోని సిర్సా (హరియాణా) వైపు నుంచి ఒక సూపర్‌సోనిక్ క్షిపణి, పంజాబ్ ప్రాంతంలోని మియాన్ చన్ను అనే ప్రాంతంలో పడినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. ఇది తమ దేశపు ఎయిర్‌స్పేస్ నిబంధనల ఉల్లంఘనే అని పాక్ విమర్శించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కొన్ని నివాసాలు మాత్రం ధ్వంసమయ్యాయని చెప్పింది. ఈ క్షిపణి ప్రయాణించిన మార్గం విమానాలు ప్రయాణించే మార్గమని, రెండు దేశాలకు సంబంధించిన విమానాలకు ప్రమాదం జరిగి ఉండేదని పాకిస్తాన్ రక్షణశాఖ విశ్లేషించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ఏవియేషన్ సేఫ్టీ ప్రొటోకాల్‌కు విరుద్ధమని పాక్ ప్రకటించింది. అయితే, ఈ ఆరోపణలపై భారత్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. 

Updated Date - 2022-03-11T19:15:31+05:30 IST