ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-02T05:01:42+05:30 IST

ఒంటరితనం భరించలేక పట్టణవాసి నాగరాజునాయక్‌ (50) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒంటరితనం భరించలేక  వ్యక్తి ఆత్మహత్య

ధర్మవరం, జూలై 1 : ఒంటరితనం భరించలేక పట్టణవాసి నాగరాజునాయక్‌ (50) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లమాడ మండలం దొన్నికోటకు చెందిన నాగరాజునాయుడు 15 ఏళ్ల క్రితం ధర్మవరానికి వలస వచ్చాడు. జర్నలిస్టుకాలనీ సమీపంలో అద్దె ఇంటిలో ఉంటూ కదిరిగేటు వద్ద రెండు చికెన సెంటర్లు ఏర్పాటు చేసుకుని జీవించేవాడు. ఈయన భార్య శ్రీదేవి. వీరికి పిల్లలు లేరు. ఆరేళ్ల క్రితం శ్రీదేవి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో చికెనసెంటర్‌లో పనిచేసే వారు శుక్రవారం ఉదయం నాగరాజునాయుడుకు ఫోన చేశారు. ఎంత సేపటికి ఫోన లిఫ్ట్‌ చేయకపోవడంతో వారు నేరుగా అతని ఇంటికి వెళ్లారు. ఇంటిలో ఉరివేసుకొని నాగరాజు నాయుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించి పోలీసులకు సమా చారం ఇచ్చారు. మృతదేహాన్ని ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ సిబ్బందితో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


Updated Date - 2022-07-02T05:01:42+05:30 IST