నిలిచిన భవన నిర్మాణం పనులు

ABN , First Publish Date - 2021-03-07T07:17:15+05:30 IST

పేదల ఆకలి తీర్చేందుకు ప్రారంభించిన అన్నా భోజన పథకం నిలపోవడమే కాక దానికోసం నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది.

నిలిచిన భవన నిర్మాణం పనులు
నిరుపయోగంగా ఉన్న క్యాంటిన్‌ భవనం

దర్శి, మార్చి 6 : పేదల ఆకలి తీర్చేందుకు ప్రారంభించిన అన్నా భోజన పథకం నిలపోవడమే కాక దానికోసం నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. దీంతో 70 శాతం పనులు పూర్తయినప్పటికీ మిగిలిన పనులు ఆర్ధాంతరంగా నిలచిపోయాయి. సుమారు రెడేళ్ల క్రితం పనులు నిలచిపోవడంతో అన్నా క్యాంటిన్‌ భవనం నిరుపయోగంగా మారింది. దీంతో లక్షలాది రూపాయల ప్రజాదనం వృథా అయ్యింది. 2018లో ఆ భవన నిర్మాణానికి రూ.36 లక్షల నిధులు మంజూరు చేశారు. సంబంధిత కాంట్రాక్టరు గోడలు నిర్మించి శ్లాబులు వేశారు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిర్మాణం పనులు నిలచిపోయాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో అన్నా భోజన పధకం రద్దు చేశారు. నిర్మించిన అన్నా క్యాంటిన్లు నిరుపయోగంగా మిగిలిపోయాయి. దర్శిలో నిర్మాణం తుది దశలో ఉన్న అన్నా క్యాంటిన్‌ భవనం పనులు అంతటితో నిలిచిపోయాయి.  ఆ తర్వాత పనులు ప్రారంబించకపోవడంతో ప్రస్తుతం సిమెంట్‌ బీటలు బారుతోంది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ భవనాన్ని పూర్తి చేసి మరో అవసరానికైనా వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-03-07T07:17:15+05:30 IST