ఉమ్రా యాత్రికులకు వీడ్కోలు
ABN , First Publish Date - 2022-08-16T05:01:15+05:30 IST
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు
శంషాబాద్, ఆగస్టు 15 : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు సోమవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉమ్రాయాత్రకు బయలుదేరి వెళ్లారు. యాత్ర కన్వీనర్ హఫీజ్ మహ్మద్ఫయ్యాజ్అలీ వారికి ఎయిర్పోర్ట్లోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్లో వీడ్కోలు పలికారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకొని యాత్రకు వెళ్తున్న వారిని చూసి ప్రయాణికులు భారత్మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. వారికి అభివాదం చేస్తూ యాత్రికులు ఎయిర్పోర్టులోకి వెళ్లారు.