ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఉమ్రా యాత్రికులు

ABN , First Publish Date - 2022-05-24T05:21:30+05:30 IST

ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఉమ్రా యాత్రికులు

ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఉమ్రా యాత్రికులు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యాత్రికులకు స్వాగతం పలుకుతున్న కుటుంబీకులు


శంషాబాద్‌రూరల్‌, మే 21 : ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి సోమవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు ఉమ్రాయాత్రికులు. ఆల్‌మిజన్‌ టూర్స్‌ ఆండ్‌ ట్రావెల్స్‌ అధ్వర్యంలో ఈనెల 9వ తేదీన యాత్రకు బయలుదేరిన యాత్రికులు  హైదరాబాద్‌కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు వారికి స్వాగతం పలికారు. సంస్ధ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హఫీస్‌ మహ్మద్‌ ఫయాజ్‌ అలీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా  రెండేళ్లుగా ఉమ్రా యాత్రకు బ్రేక్‌ పడింది. అల్లా దయవల్ల తిరిగి యాత్ర ప్రారభమైంది. అక్కడి ప్రభుత్వం యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. ఈ యాత్రకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి యాత్రికులు వస్తున్నారని పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-24T05:21:30+05:30 IST