funeral: ఉమామహేశ్వరి అంత్యక్రియలు పూర్తి

ABN , First Publish Date - 2022-08-03T20:19:45+05:30 IST

ఉమామహేశ్వరి భౌతికకాయానికి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి.

funeral: ఉమామహేశ్వరి అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్ (Hydedrabad): మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ (NTR) చిన్నకుమార్తె (Daughter) కంఠమనేని ఉమామహేశ్వరి (Umamaheswari) భౌతికకాయానికి అంత్యక్రియలు (funeral) జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియల్లో బాలకృష్ణ, రామకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కంఠమనేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతిమ సంస్కారాలను ఉమామహేశ్వరి భర్త శ్రీనివాస్‌ పూర్తి చేశారు. 


ఎన్‌టీఆర్‌ (NTR) నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (Umamaheswari) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఎన్‌టీఆర్‌ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల కుటుంబం అమెరికాలో ఉండడంతో ఆమె వచ్చే వరకు అంత్యక్రియలు జరపలేదు. బుధవారం తెల్లవారుజామున వారు హైదరాబాద్‌ చేరుకుని తల్లి పార్ధివ దేహానికి నివాళులర్పించారు. అలాగే ఉమామహేశ్వరిని కడసారి చూసేందుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం ఉమామహేశ్వరి నివాసం నుంచి జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగింది.

Updated Date - 2022-08-03T20:19:45+05:30 IST