ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉమామహేశ్వర్రావు
ABN , First Publish Date - 2022-05-24T05:09:09+05:30 IST
ఇబ్రహీంపట్నం ఏసీపీగా టీఎస్. ఉమామహేశ్వర్రావును
ఇబ్రహీంపట్నం, మే 23: ఇబ్రహీంపట్నం ఏసీపీగా టీఎస్. ఉమామహేశ్వర్రావును నియమిస్తూ డీజీపీ మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనను ఖాళీగా ఉన్న ఈ స్థానంలో ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. కాగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి కర్నంగూడ వద్ద మార్చి 1న జరిగిన జంట రియల్టర్ల హత్యలకు సంబంధించి నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై ఏసీపీ బాలకృష్టారెడ్డి ఏప్రిల్ 23 నుంచి సస్పెన్షన్లో ఉన్నారు. నాటి నుంచి భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ఎం.శంకరయ్య ఇక్కడ ఇన్చార్జి ఏసీపీగా విధులు నిర్వర్తించారు.