రష్యా దాడిలో 115 మంది చిన్నారులు మృతి

ABN , First Publish Date - 2022-03-20T21:56:08+05:30 IST

ఉక్రెయిన్‌పై ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో 115 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ వెల్లడించింది. మరో 140కి పైగా చిన్నారులు గాయపడ్డారని తెలిపింది.

రష్యా దాడిలో 115 మంది చిన్నారులు మృతి

ఉక్రెయిన్‌పై ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో 115 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ వెల్లడించింది. మరో 140కి పైగా చిన్నారులు గాయపడ్డారని తెలిపింది. రష్యా దాడి బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిందని పార్లమెంట్ ప్రకటించింది. గతరాత్రి ఖార్కివ్‌లో జరిగిన దాడిలో కూడా తొమ్మిదేళ్ల బాలుడు మృతిచెందాడు. కీవ్ నగరంలో రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో సాషా అనే తొమ్మిదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే బాలికను ఆసుత్రికి తీసుకెళ్లగా, డాక్టర్లు ఆమె ఎడమచేయిని చాలా వరకు తొలగించారు. ఈ కాల్పుల్లో ఆమె తండ్రి కూడా మరణించాడు. సాషా కుటుంబంతో కలిసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరోవైపు ఆదివారం కూడా సూపర్‌సోనిక్ మిస్సైల్ ప్రయోగించినట్లు రష్యా ప్రకటించింది.

Updated Date - 2022-03-20T21:56:08+05:30 IST