క్షేమంగా చేరుకున్నారు...

ABN , First Publish Date - 2022-03-12T13:26:43+05:30 IST

ఉక్రెయిన్‌ నుంచి రాష్ట్రానికి చెందిన 57 మంది విద్యార్థులు శుక్రవారం వేకువజామున విమానంలో ఢిల్లీ చేరు కున్నారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రానికి చెన్నై నగరానికి విచ్చేశారు. గత వారం రోజులకు

క్షేమంగా చేరుకున్నారు...

- ఉక్రెయిన్‌ నుంచి చెన్నై వచ్చిన విద్యార్థులు 

- స్వస్థలాలకు తరలిన 57 మంది 


చెన్నై: ఉక్రెయిన్‌ నుంచి రాష్ట్రానికి చెందిన 57 మంది విద్యార్థులు శుక్రవారం వేకువజామున విమానంలో ఢిల్లీ చేరు కున్నారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రానికి చెన్నై నగరానికి విచ్చేశారు. గత వారం రోజులకు పైగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివా నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఎంపీల కమిటీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉక్రెయిన్‌ నుంచి వస్తున్న తమిళ విద్యార్థులను ప్రభుత్వ ఖర్చులతో విమాన సదుపాయం కల్పించి స్వస్థలాలకు తరలిస్తోంది. శుక్రవారం వేకువజాము ఎయిర్‌ ఇండియా విమానం ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన 242 మంది ఢిల్లీ చేరుకున్నారు. వీరిలో 57 మంది తమిళ విద్యార్థులున్నారు. వీరికి ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఎంపీల కమిటీ అధ్యక్షుడు తిరుచ్చి శివా, ఢిల్లీ తమిళనాడు హౌస్‌ ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలందించి స్వాగతం పలికారు. ప్రభుత్వ ఖర్చులతో టికెట్లను కొని విమానం ఎక్కించారు. ఆ విమానం శుక్రవారం సాయంత్రం చెన్నై చేరుకుంది. విమానాశ్రయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆ విద్యార్థులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో స్వస్థలాలకు తరలించారు.

Updated Date - 2022-03-12T13:26:43+05:30 IST