అధిక ప్రమాదమున్న దేశంగా పాక్...యూకే జాబితాలో వెల్లడి

ABN , First Publish Date - 2021-04-13T17:59:56+05:30 IST

ప్రపంచంలో హైరిస్క్ దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరును యునైటెడ్ కింగ్‌డమ్ చేర్చింది....

అధిక ప్రమాదమున్న దేశంగా పాక్...యూకే జాబితాలో వెల్లడి

న్యూఢిల్లీ : ప్రపంచంలో హైరిస్క్ దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరును యునైటెడ్ కింగ్‌డమ్ చేర్చింది. మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్  ఉన్న హైరిస్క్ దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరును బ్రిటన్ చేర్చింది. పాకిస్థాన్ దేశంతోపాటు నార్త్ కొరియా, సిరియా, జింబాబ్వే, యెమన్ తదితర 21 దేశాలను యూకే చేర్చింది. కాగా యూకే తమ దేశాన్ని వాస్తవాల ఆధారంగా హైరిస్క్ జాబితాలో చేర్చలేదని పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది.మొత్తం మీద ప్రపంచంలో హైరిస్క్ ఉన్న దేశాల జాబితాలో పాక్ పేరు చేర్చడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2021-04-13T17:59:56+05:30 IST