చైనాకు త్వరలో మరో ఝలక్!

ABN , First Publish Date - 2020-07-05T20:35:52+05:30 IST

చైనా కంపెనీలతో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని బ్రిటన్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న చైనా కంపెనీ హువావేకు చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది.

చైనాకు త్వరలో మరో ఝలక్!

లండన్: చైనా కంపెనీలతో దేశ భద్రతకు ముప్పు పోంచి ఉందని బ్రిటన్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న చైనా కంపెనీ హువావేకు చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకూ అమర్చిన హువావే కంపెనీ పరికరాలను తొలగించడంతో పాటూ మరో ఆరు నెలల్లో బ్రిటన్‌లో పూర్తిగా ఆ కంపెనీ సేవలను నిలిపివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనా టెక్నాలజీ వల్ల దేశానికి ముప్పు పొంచి ఉందని అని బ్రిటన్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఇటీవల ఓ అంచనాకు వచ్చింది. హువావేపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షల ద్వారా అమెరికా సంస్థల టెక్నాలజీ చైనా కంపెనీలకు దొరకకుండా అమెరికా గట్టి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో హువావే..ఎవరీకీ తెలియని ఓ కొత్త టెక్నాలజీని బ్రిటన్‌లో వినియోగిస్తే అది దేశ భద్రతకు పెద్ద ముప్పని సైబర్ సెక్యూరిటీ సెంటర్ భావిస్తోంది. ఈ వివరాలతో కూడిన ఓ సవివరమైన నివేదికను త్వరలో బ్రిటన్ ప్రధానికి సమర్పించనుంది.

Updated Date - 2020-07-05T20:35:52+05:30 IST