రైలుపట్టాలపై పడుకుని ఫోటోలకు ఫోజులు.. అధికారుల వార్నింగ్

ABN , First Publish Date - 2021-01-23T21:35:40+05:30 IST

ఇంగ్లండ్‌లోని ఓ రైల్వే బ్రిడ్జిపై ఓ మహిళ పడుకుంది. ఆమెను మరో మహిళ ఫోటోలు తీస్తోంది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో..

రైలుపట్టాలపై పడుకుని ఫోటోలకు ఫోజులు.. అధికారుల వార్నింగ్

లండన్: ఇంగ్లండ్‌లోని ఓ రైల్వే బ్రిడ్జిపై ఓ మహిళ పడుకుంది. ఆమెను మరో మహిళ ఫోటోలు తీస్తోంది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఇంగ్లండ్ నెట్‌వర్క్ రైల్ అధికారులు దీనిపై దృష్టి సారించారు. వెంటనే సదరు మహిళకు అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆ వీడియోను షేర్ చేసిన లెవెల్ క్రాసింగ్ మేనేజర్.. రైల్వే లెవెల్ క్రాసింగ్ ఫోటోలు దిగే ప్రాంతం ఎంతమాత్రం కాదని, ఒక్క క్షణంలో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం మొత్తం బాధపడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ మహిళపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో ఇతరులకు ఏం సదేశం ఇవ్వాలనుకుంటున్నారంటూ మండిపడుతున్నారు.



Updated Date - 2021-01-23T21:35:40+05:30 IST