కేవలం ఐదు రోజుల జాబ్కు రూ.5 లక్షల శాలరీ..!
ABN , First Publish Date - 2022-05-24T00:53:43+05:30 IST
నిరుద్యోగ సమస్య యువతను పట్టి పీడిస్తోంది. ఉద్యోగ ప్రకటన వెలువడిందంటే చాలు.. లక్షలు, వేలల్లో దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఓ కంపెనీ ప్రకటించిన ఉద్యోగం సోషల్ మీడియాలో తెగ వైరల్
ఇంటర్నెట్ డెస్క్: నిరుద్యోగ సమస్య యువతను పట్టి పీడిస్తోంది. ఉద్యోగ ప్రకటన వెలువడిందంటే చాలు.. లక్షలు, వేలల్లో దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఓ కంపెనీ ప్రకటించిన ఉద్యోగం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లండన్కు చెందిన ఓమ్ని అనే కంపెనీ తాజాగా ఓ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఐదు రోజుల ఉద్యోగానికి రూ.5 లక్షల జీతం ప్రకటించింది. మరి ఐదు రోజుల ఉద్యోగం చేరాక ఏం చేయాలి అనే కదా.. మీడౌట్.. ఏం లేదు.. ఆ కంపెనీ తయారుచేసే ఫుడ్ తిని ఎలా ఉందో కంపెనీకి చెప్పాలి.
తిన్నప్పుడు శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి. కడుపులో ఏమైనా తిప్పినట్టు అనిపించిందా.. ఇలా అన్ని రకాల వివరాలు ఇవ్వాలి. ఈ ఆహారాన్ని మొరం గడ్డ, బీన్స్, బ్రౌన్ రైస్, గుమ్మడి, బ్లూ బెర్రీలు, బఠాణీలు వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ప్యూర్ వెజ్ అన్న మాట. అయితే ఈ ఉద్యోగం కేవలం బ్రిటన్ వాసులకు మాత్రమే అంటూ కంపెనీ తిరకాసు పెట్టింది. దాంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. మాకు ఒక్క అవకాశం ఇవ్వొచ్చు కదా అంటూ ఆ సంస్థను కోరుతున్నారు.