కరోనాపై రంగం భవిష్యవాణి.. ఉజ్జయిని అమ్మవారు తీవ్ర హెచ్చరిక

ABN , First Publish Date - 2020-07-13T16:27:41+05:30 IST

రంగం భవిష్యవాణిలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు తీవ్ర హెచ్చరికలు చేశారు. రాబోయే కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

కరోనాపై రంగం భవిష్యవాణి.. ఉజ్జయిని అమ్మవారు తీవ్ర హెచ్చరిక

హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రంగంలో జోగిని స్వర్ణలత చెప్పిన భవిష్యవాణిలో అమ్మవారు తీవ్ర హెచ్చరికలు చేశారు. రాబోయే కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరు చేసుకున్నదానికి వాళ్లు అనుభవించక తప్పదు కదా అని అమ్మ అన్నారు. అయితే కట్టడి చేయడానికి తాను ఉన్నానని.. భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయండని ఆజ్ఞాపించారు. ప్రతి గడప నుంచి శాక, పప్పుబెల్లాలు రావాలన్నారు. కామంతో కాకుండా, భక్తిభావనతో చేసినట్టైతే... తప్పక కాపాడతానన్నారు. ఈ ఏడాది ఉత్సవాలు తనకు సంతోషంగా లేవని అమ్మవారు అన్నారు. ప్రజలందిరినీ తాను కాపాడతానని, కరోనాపై పోరాడతానని తెలిపారు. రాబోయే రోజులు కష్టాలతో ఉంటాయని.. తీవ్రస్వరంలో చెప్పారు. 

Updated Date - 2020-07-13T16:27:41+05:30 IST