బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు

ABN , First Publish Date - 2021-04-13T20:27:52+05:30 IST

నగరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.

బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు

 హైదరాబాద్: నగరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో నిర్వహించిన పంచాగ శ్రవణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, చింతల, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు.  ఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది కరోనాపై విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. చీకట్లో నుంచి ప్లవ నామ సంవత్సరంలో వెలుగులోకి అడుగు పెడుతున్నామని చెప్పారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 


అనతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉందని వేద పండితులు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. మోదీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. కుట్రలు, కుంతంత్రాలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా పేద ప్రజల కోసం పని చేద్దామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇదే పంధాలోనే ముందుకు వెళ్తూ రాష్ట్రాన్ని కాపాడుకుందామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-04-13T20:27:52+05:30 IST