పలువురు పోలీసులకు ఉగాది పురస్కారాలు
ABN , First Publish Date - 2021-04-13T05:51:39+05:30 IST
పలువురు పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను ప్రకటించింది. చిత్తూరు జిల్లా పరిధిలో ఎనిమిది మంది ఎస్ఐలు, ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుల్స్ పురస్కారాన్ని అందుకున్నారు.
చిత్తూరు, ఏప్రిల్ 12: పలువురు పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను ప్రకటించింది. చిత్తూరు జిల్లా పరిధిలో ఎనిమిది మంది ఎస్ఐలు, ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుల్స్ పురస్కారాన్ని అందుకున్నారు. ఎస్బీ ఎస్ఐ మాధవనాయుడు, పుత్తూరు స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న కుప్పుస్వామి ఉత్తమ సేవ పథకానికి ఎంపికయ్యారు. అదేవిధంగా డీసీఆర్బీ ఎస్ఐ మురళీధర్, చిత్తూరు ఒకటో పట్టణ ఏఎస్ఐ మణి, వెదురుకుప్పం ఏఎస్ఐ చంద్రశేఖర్, గంగవరం ఏఎస్ఐ మనోహర్, ఏఆర్ఎస్ఐ డిల్లీబాబు, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ రామచంద్రన్, అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న లీడింగ్ ఫైర్మెన్ రఘునాథరెడ్డి, పీలేరు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజుకు సేవ పతకాలు లభించాయి.