వలంటీర్లకు ఉగాది సేవా పురస్కారాలు

ABN , First Publish Date - 2021-04-13T05:19:15+05:30 IST

కర్నూలు కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో సోమవారం కర్నూలు నియోజకవర్గ వలంటీర్ల సేవలకు ఉగాది పురస్కారాలు అందజేశారు.

వలంటీర్లకు ఉగాది సేవా పురస్కారాలు

కర్నూలు, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): కర్నూలు కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో సోమవారం కర్నూలు నియోజకవర్గ వలంటీర్ల సేవలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ ఎస్‌.రేణక, జేసీ, ఇన్‌చార్జి కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, కమిషనర్‌ డీకే బాలాజి, డీపీవో ప్రభాకర్‌రావు, జడ్పీ డిప్యూటీ సీఈవో భాస్కర్‌ నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. వలంటీర్లను వారు సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో భాస్కర్‌ నాయుడు, అడిషినల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T05:19:15+05:30 IST