ఉద్యానశాఖలో ఔట్సోర్సింగ్ సిబ్బందిపై వేటు
ABN , First Publish Date - 2020-04-10T07:06:20+05:30 IST
ఉద్యానశాఖలోని ఔట్సోర్సింగ్ సిబ్బందిపై వేటు పడింది. మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్లు 38, విస్తరణాధికారులు(హెచ్ఈవోలు) 200, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 262 మంది, జూనియర్...
ఉద్యానశాఖలోని ఔట్సోర్సింగ్ సిబ్బందిపై వేటు పడింది. మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్లు 38, విస్తరణాధికారులు(హెచ్ఈవోలు) 200, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 262 మంది, జూనియర్/సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు.. మొత్తం కలిపి రాష్ట్రంలో 500 మందిని తొలగిస్తూ హార్టికల్చర్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డ్రిప్, స్ర్పింక్లర్ యూనిట్ల మంజూరు, పండ్ల తోటల, కూరగాయల సాగు విస్తీర్ణం పెంపు, పాలీహౌ్సలు, ఆర్కేవీవై, విత్తనాల పంపిణీ, టెర్రస్ గార్డెనింగ్ విభాగాల్లో ఇన్ని రోజులుగా వీరి సేవలను వినియోగించుకున్నారు. పదిహేనేళ్లుగా తాము విధులు నిర్వర్తిస్తున్నామని, ఉన్నపళంగా తొలగిస్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఐదు నెలులగా వేతనాలు సైతం ఇవ్వడం లేదని, కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగాలు తీసేస్తే భార్యాపిల్లలతో సహా రోడ్డున పడతామని అంటున్నారు. తమపై దయ చూపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.