ఉద్ధవ్ అనర్హమైన కొడుకు: అఖిల భారతీయ సంత్ సమితి

ABN , First Publish Date - 2020-08-02T22:43:11+05:30 IST

రామ మందిర నిర్మాణం కోసం తలపెట్టిన భూమి పూజను కరోనా కారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించాలని ఆయన చేసిన సూచనపై సాధువులు ఈ విధంగా స్పందించారు.

ఉద్ధవ్ అనర్హమైన కొడుకు: అఖిల భారతీయ సంత్ సమితి

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై అఖిల భారతీయ సంత్ సమితి సాధువులు, సన్యాసులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘తండ్రి వారసత్వానికి అనర్హమైన కొడుకు’ అంటూ వారు మండిపడ్డారు. రామ మందిర నిర్మాణం కోసం తలపెట్టిన భూమి పూజను కరోనా కారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించాలని ఆయన చేసిన సూచనపై సాధువులు ఈ విధంగా స్పందించారు.


‘‘బాల్ థాకరే చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి అనర్హమైన కొడుకు పుట్టాడు. అయితే కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న ఉద్దవ్‌కు ధర్మం, ఆధ్యాత్మికత గురించి ఏం తెలుస్తుంది? రాజకీయ భాష, ఆధ్యాత్మిక భాష వేరు వేరుగా ఉంటాయి. ఇటాలియన్ బెటాలియన్ ఒడిలో కూర్చున్న వ్యక్తి నుంచి ఇంతకు మించి ఊహించలేం కూడా’’ అని అఖిల భారతీయ సంత్ సమితి జనరల్ సెక్రెటరీ జితేంద్రానంద్ సరస్వతి అన్నారు.

Updated Date - 2020-08-02T22:43:11+05:30 IST