కేసీఆర్‌తో కలిసి పనిచేస్తాం: ఉద్ధవ్‌ ఠాక్రే

ABN , First Publish Date - 2022-02-20T22:54:27+05:30 IST

దేశ హితం కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. ఈ రోజు ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ అయ్యారు.

కేసీఆర్‌తో కలిసి పనిచేస్తాం: ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబై: దేశ హితం కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. ఈ రోజు ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ తమతో కలిసి వచ్చే నేతలతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. దేశంలో విధాన పరమైన మార్పుల కోసం పోరాడుతామని తెలిపారు. దేశంలో మరిన్ని మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి ఏ ఉద్యమం ప్రారంభమైనా విజయవంతమైందని చెప్పారు. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ముందుకెళ్తామని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు.

Updated Date - 2022-02-20T22:54:27+05:30 IST