Uddhav challenge: మధ్యంతర ఎన్నికలకు వెళ్దాం..

ABN , First Publish Date - 2022-07-05T02:03:45+05:30 IST

విశ్వాస పరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని కొత్త ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సవాలు..

Uddhav challenge: మధ్యంతర ఎన్నికలకు వెళ్దాం..

ముంబై: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని కొత్త ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సవాలు విసిరారు. ధైర్యం ఉండే మధ్యంతర ఎన్నికలకు వెళ్దామని, ప్రజాకోర్టులోనే తేల్చుకుందామని అన్నారు. ముంబైలోని శివసేన భవనంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీని (శివసేన) అంతం చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు.


''నేను సవాలు చేస్తున్నాను. మధ్యంతర ఎన్నికలు నిర్వహించండి. ఇన్ని గేమ్‌లు ఆడటానికి బదులుగా ప్రజాకోర్టు ముందుకు వెళ్దాం. మాదే తప్పయితే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపుతారు. తప్పు మీదే (బీజేపీ-షిండే వర్గం) అయితే మిమ్మల్ని ఇంటికి సాగనంపుతారు'' అని ఉద్ధవ్ అన్నారు. 

Updated Date - 2022-07-05T02:03:45+05:30 IST