సీఏఏ, ఎన్పీఆర్కు మద్దతిస్తున్నా: మోదీతో భేటీ తర్వాత ఉద్ధవ్
ABN , First Publish Date - 2020-02-22T01:07:13+05:30 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ తర్వాత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే.. తనయుడు ఆదిత్య థాకరే, పార్టీ ఎంపీ సంజయ్ రౌత్తో కలిసి విలేకరుల సమావేశం ...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ తర్వాత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే.. తనయుడు ఆదిత్య థాకరే, పార్టీ ఎంపీ సంజయ్ రౌత్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఏఏ, ఎన్పీఆర్లపై ప్రధానితో చర్చించామని చెప్పారు. సీఏఏ, ఎన్పీఆర్లకు మద్దతిస్తున్నామన్నారు. సీఏఏ వల్ల మహారాష్ట్రలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగబోదని చెప్పారు. త్వరలో మహారాష్ట్రలో ఎన్పీఆర్ అమలు చేస్తామన్నారు. అదే సమయంలో ఎన్ఆర్సీ గురించి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేయబోవడం లేదని ప్రధాని చెప్పారని ఉద్ధవ్ తెలిపారు. మరోవైపు స్వాతంత్ర్య వీర సావర్కర్పై అడిగిన ప్రశ్నకు ఉద్ధవ్ సమాధానం చెప్పకుండా దాటవేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సావర్కర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. దీనిపై ఉద్ధవ్ స్పందించలేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది.