రిజర్వేషన్ కోటాపై మోదీకి ఉద్ధవ్ విజ్ణప్తి

ABN , First Publish Date - 2021-05-12T01:06:43+05:30 IST

మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. రిజర్వేషన్ కోటా 50 శాతం మించకూడదనే నిబంధనకు ఇది వ్యతిరేకంగా ఉందని

రిజర్వేషన్ కోటాపై మోదీకి ఉద్ధవ్ విజ్ణప్తి

ముంబై: మరాఠా సామాజిక వర్గాన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన సామాజివర్గం (సోషల్లీ అండ్ ఎడ్యూకేషనల్లీ బ్యాక్‌వర్డ్ క్లాస్) కింద పరిగణించి వారికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు అనుమతించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోరారు. మంగళవారం ప్రధానికి రాసిన లేఖలో మరాఠా రిజర్వేషన్‌పై కోటాపై ప్రత్యేక విజ్ణప్తి చేశారు.


మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. రిజర్వేషన్ కోటా 50 శాతం మించకూడదనే నిబంధనకు ఇది వ్యతిరేకంగా ఉందని, అంతే కాకుండా ఇలాంటి చట్టాలు చేసే అధికారం ప్రధానికి రాష్ట్రపతికి మాత్రమే ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే మరాఠాలకు రిజర్వేషన్లు సాధించే వరకు  చట్టబద్ధమైన పోరాటం కొనసాగిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. సుప్రీం తీర్పును దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-05-12T01:06:43+05:30 IST