ఉదయ్‌పూర్‌లో Congress రాష్ట్ర నేతల సందడి

ABN , First Publish Date - 2022-05-14T16:47:57+05:30 IST

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో శుక్రవారం ప్రారంభమైన ఏఐసీసీ చింతనా శిబిర్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌

ఉదయ్‌పూర్‌లో Congress రాష్ట్ర నేతల సందడి

బెంగళూరు: రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో శుక్రవారం ప్రారంభమైన ఏఐసీసీ చింతనా శిబిర్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ స్వయంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఆహ్వానించి సభాస్థలి వైపునకు తీసుకెళ్లడం విశేషం. పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేపీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు ఎంబీ పాటిల్‌, కేపీసీసీ మాజీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్‌, శాసనసభలో ప్రతిపక్షనేత సిద్ధరామయ్య తదితర నేతలు ఈ సమావేశంలో ఉత్సాహభరితంగా కనిపించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో ఐక్యత కనిపించింది. అందరూ గ్రూప్‌గా ఫొటోలకు ఫోజులిచ్చారు. కాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఉదయ్‌పూర్‌లోనూ స్పష్టం చేయడం విశేషం. తమందరి లక్ష్యం 2023లో కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేశ రాజకీయాలను మలుపుతిప్పడమేనన్నారు.

Read more