కోలుకుంటున్న యూఏఈ...

ABN , First Publish Date - 2020-07-15T15:01:56+05:30 IST

గల్ఫ్ దేశ‌మైన యూఏఈ క్ర‌మంగా మ‌హ‌మ్మారి క‌రోనా నుంచి కోలుకుంటోంది. గ‌త కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు త‌గ్గ‌డంతో పాటు రిక‌వ‌రీలు పెరుగుతున్నాయి.

కోలుకుంటున్న యూఏఈ...

యూఏఈ: గల్ఫ్ దేశ‌మైన యూఏఈ క్ర‌మంగా మ‌హ‌మ్మారి క‌రోనా నుంచి కోలుకుంటోంది. గ‌త కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు త‌గ్గ‌డంతో పాటు రిక‌వ‌రీలు పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం కూడా 375 కొత్త కేసులు న‌మోదైతే.. 512 రిక‌వ‌రీలు న‌మోద‌య్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు  55,573 మందికి కోవిడ్ సోకితే... 46,025 మంది క‌రోనా బాధితులు కోలుకున్న‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు యూఏఈ వ్యాప్తంగా 335 మందిని ఈ వైర‌స్ బ‌లిగొంది. మ‌రోవైపు కోవిడ్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు యూఏఈ ముమ్మ‌రంగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే రికార్డుస్థాయిలో 4 మిలియ‌న్ల‌కు పైగా కోవిడ్ టెస్టులు పూర్తి చేసింది. అలాగే ఆగ‌స్టు నెలాఖ‌రు వ‌ర‌కు 6 మిలియ‌న్ల క‌రోనా ప‌రీక్ష‌లు పూర్తి చేయాల‌ని యూఏఈ ఆరోగ్య‌శాఖ నిర్ణ‌యించుకుంది. అందుకే ప్ర‌తిరోజూ దేశ‌వ్యాప్తంగా వేల సంఖ్య‌లో కోవిడ్ టెస్టులు చేప‌డుతోంది. అంతేగాక వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌లోనూ మూడో ద‌శ‌కు చేరుకున్న‌ట్లు ఆ దేశ‌ ఆరోగ్య‌శాఖ మంత్రి అబ్దుల్ రెహ్మాన్ అల్ ఓవైస్ తెలిపారు.  

Updated Date - 2020-07-15T15:01:56+05:30 IST