క‌రోనాపై పోరులో యూఏఈ కీల‌క నిర్ణ‌యం..!

ABN , First Publish Date - 2020-06-07T14:35:50+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనాపై పోరులో తాజాగా యూఏఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

క‌రోనాపై పోరులో యూఏఈ కీల‌క నిర్ణ‌యం..!

యూఏఈ: మ‌హ‌మ్మారి క‌రోనాపై పోరులో తాజాగా యూఏఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశ‌వ్యాప్తంగా రోజురోజుకు కోవిడ్ కేసులు అంత‌కంత‌కు పెరుగుతుండ‌డంతో దేశ ప్ర‌జ‌లంద‌రికీ క‌రోనా టెస్టులు నిర్వ‌హించేందుకు సిద్ధమ‌వుతోంది. ఇక ఈ వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు యూఏఈ ముమ్మ‌రంగా కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్ప‌టికే రెండు మిలియ‌న్‌కు పైగా మందికి క‌రోనా టెస్టులు చేసింది. ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదవుతుండ‌డంతో మిగిలిన 90 ల‌క్ష‌ల మందికి కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు యోచిస్తోంది. అంతేగాక గ‌త కొన్ని నెల‌లుగా క్ర‌మం త‌ప్పకుండా శానిటైజేష‌న్ కార్య‌క్ర‌మం చేప‌డుతోంది. ఇదిలాఉంటే... యూఏఈలో ఇప్ప‌టివ‌ర‌కు 38, 268 మంది ఈ వైర‌స్ బారిన ప‌డ‌గా, 275 మంది మ‌ర‌ణించారు.   

Updated Date - 2020-06-07T14:35:50+05:30 IST