50వ యుఏఈ జాతీయ దినోత్సవ వేడుకలు..ఘనంగా జరుపుకున్న ఎన్నారైలు

ABN , First Publish Date - 2021-12-03T22:58:18+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం 50వ జాతీయ దినోత్సవాన్ని ఇమరాతీ జాతీయులతో పాటు ప్రవాస భారతీయులు కూడ ఘనంగా జరుపుకొన్నారు.

50వ యుఏఈ జాతీయ దినోత్సవ వేడుకలు..ఘనంగా జరుపుకున్న ఎన్నారైలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం 50వ జాతీయ దినోత్సవాన్ని ఇమరాతీ జాతీయులతో పాటు ప్రవాస భారతీయులు కూడ ఘనంగా జరుపుకొన్నారు. గురువారం దుబాయిలోని అల్ ఖూజ్ ప్రాంతంలో తెలంగాణ పిసిసి ఎన్నారై సెల్ అధ్యక్షుడు ఎస్వీ రెడ్డి అధ్వర్యంలో ఈ వేడుకల జరిగాయి. యస్వీ రెడ్డి ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన.. యు.ఏ.ఇ సమాఖ్యగా అవతరించిన గత 50 సంవత్సరాలలో సాధంచిన పురోగతి, అందులో ప్రవాస భారతీయుల పాత్ర గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో నల్లశేఖర్, సదానంద్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2021-12-03T22:58:18+05:30 IST