యూఏఈ కీలక నిర్ణయం.. 12 దేశాలపై నిషేధం ఎత్తివేత.. ప్రయాణానికి పౌరులకు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2022-02-05T13:42:33+05:30 IST

యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరులపై విధించిన ప్రయాణ ఆంక్షలను తొలగించింది. పౌరులు ఇకపై అన్ని దేశాలకు ప్రయాణించొచ్చు అని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి

యూఏఈ కీలక నిర్ణయం.. 12 దేశాలపై నిషేధం ఎత్తివేత.. ప్రయాణానికి పౌరులకు గ్రీన్ సిగ్నల్

ఎన్నారై డెస్క్: యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరులపై విధించిన ప్రయాణ ఆంక్షలను తొలగించింది. పౌరులు ఇకపై అన్ని దేశాలకు ప్రయాణించొచ్చు అని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో యూఏఈ ప్రభుత్వం 12ఆఫ్రికన్ దేశాలపై నిషేధం విధించింది. యూఏఈ పౌరులు ఆ దేశాలకు వెళ్లకూడదు అని ఆంక్షలు విధించింది. అయితే ఈ ఆంక్షలను తాజాగా ప్రభుత్వం ఎత్తేసింది. గుర్తింపు పొందిన కొవిడ్ వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో తీసుకున్న పౌరులు ఇకపై ఆఫ్రికన్ దేశాలకు కూడా ప్రయాణించొచ్చని వెల్లడించింది. చికిత్సలో భాగంగా కొవిడ్ వ్యాక్సిన్ నుంచి మినహాయింపు పొందిన పౌరుల ప్రయాణానికి కూడా యూఏఈ ప్రభుత్వం అనుమతించింది. అయితే.. వ్యాక్సిన్ తీసుకోని పౌరులు మాస్కులు ధరించడంతోపాటు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలు ఫిబ్రవరి 6 నుంచి అమలులోకి రానున్నట్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. యూఏఈ ప్రభుత్వం నిషేధం ఎత్తేసిన దేశాల జాబితాలో కెన్యా, ఇథియోపియా, నైజిరియా, కాంగో , దక్షిణాఫ్రికా తదితర దేశాలు ఉన్నాయి.




Updated Date - 2022-02-05T13:42:33+05:30 IST