Mirage fighter plane టైరు చోరీ...పోలీసులు కేసు నమోదు

ABN , First Publish Date - 2021-12-03T14:06:02+05:30 IST

లక్నో ఎయిర్‌బేస్‌లో ట్రక్కు నుంచి యుద్ధ విమానం టైర్ ను గుర్తుతెలియని దొంగలు చోరీ చేశారు....

Mirage fighter plane టైరు చోరీ...పోలీసులు కేసు నమోదు

లక్నో : లక్నో ఎయిర్‌బేస్‌లో ట్రక్కు నుంచి యుద్ధ విమానం టైర్ ను గుర్తుతెలియని దొంగలు చోరీ చేశారు.నవంబర్ 27న లక్నోలోని బక్షి-కా-తలాబ్ ఎయిర్‌బేస్ నుంచి జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌కు ట్రక్కులో మిరాజ్ యుద్ధవిమానాన్ని తీసుకువెళుతుండగా యుద్ధ విమానం టైర్ ను గుర్తుతెలియని దొంగలు అపహరించారు.ట్రక్ డ్రైవర్ హేమ్ సింగ్ రావత్ బక్షి-కా-తలాబ్ వైమానిక స్థావరం నుంచి యుద్ధ విమానాన్ని తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది.షహీద్‌ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో స్కార్పియో వాహనంలో వెళుతున్న దుండగులు టైరుకు కట్టేందుకు ఉపయోగించే పట్టీని పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. 


లారీ డ్రైవర్‌ పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి వారు చేరుకుని విచారణ ప్రారంభించారు.షాహీద్‌ మార్గంలో జామ్‌ కావడంతో ట్రక్కు నెమ్మదిగా కదులుతున్న సమయంలో దొంగలు అర్ధరాత్రి 12:30 నుంచి ఒంటి గంట మధ్య చోరీకి పాల్పడ్డారని ట్రక్‌ డ్రైవర్‌ తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేశామని,నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ ఈస్ట్ అమిత్ కుమార్ తెలిపారు.


Updated Date - 2021-12-03T14:06:02+05:30 IST