కోదాడలో దారుణం.. యువతిని ఆటోలో తీసుకెళ్లి..

ABN , First Publish Date - 2022-04-18T22:22:04+05:30 IST

సూర్యాపేట : మహిళలపై లైంగిక దాడులు తీవ్రంగా కలవరపరుస్తున్న వేళ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కోదాడలో ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు మూడు రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బయటపడింది.

కోదాడలో దారుణం.. యువతిని ఆటోలో తీసుకెళ్లి..

సూర్యాపేట : మహిళలపై లైంగిక దాడులు తీవ్రంగా కలవరపరుస్తున్న వేళ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కోదాడలో ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు మూడు రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బయటపడింది. యువతిని ఆటోలో తీసుకువెళ్లిన నిందితులు కూల్ డ్రింక్ బాటిల్‌లో‌‌ మత్తు మందు కలిపి తాగిపించారు. అనంతరం తీవ్రంగా కొట్టి దుర్మార్గానికి పాల్పడ్డారు. మత్తు నుంచి తేరుకున్న యువతి వెంటనే బంధువులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వైద్య నిమిత్తం బాధిత యువతిని సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణంపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసుల నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. నిందితుల్లో ఒకరు టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ కొడుకని తెలిసింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-18T22:22:04+05:30 IST