ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
ABN , First Publish Date - 2021-07-06T23:54:49+05:30 IST
ఈతకు వెళ్ల ఇద్దరు యువకులు మృతి చెందడంతో సంఘటన జిల్లాలో విషాదం నెలకొంది.
సిద్దిపేట: ఈతకు వెళ్ల ఇద్దరు యువకులు మృతి చెందడంతో జిల్లాలో విషాదం నెలకొంది. కోహెడ మండలంలోని పోరెడ్డిపల్లిలో మోయ తుమ్మెద వాగు ప్రవహిస్తుంది. తుమ్మెద వాగులో ఈత కొట్టడానికి ఇద్దరు యువకులు వెళ్లారు. అయితే వారు నీటిలోనే మృతి చెందారు. మృతులను ప్రశాంత్ (19), కుమారస్వామి (21)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.