కృష్ణానదిలో ఇద్దరు యువకుల గల్లంతు
ABN , First Publish Date - 2021-07-20T01:00:21+05:30 IST
కృష్ణానదిలో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
అమరావతి: కృష్ణానదిలో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన నాగాయలంక శ్రీరామ పాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి, మరొకరు గల్లంతయ్యారు. గల్లంతయిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మావూరి దుర్గాప్రసాద్గా గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన పరాచీ పవన్ కుమార్గా గుర్తించారు. ఇరువురు ఓ ఫార్మా కంపెనీలో రిప్రజంటేటీవ్లుగా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గల్లంతయిన వ్యక్తి కోసం పోలీస్ మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.