మొదటిసారి కొన్న లాటరీ టికెటే.. రెండేళ్ల భారతీయ బాలుడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది

ABN , First Publish Date - 2021-10-21T16:12:56+05:30 IST

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా తలుపుతడుతుందో చెప్పలేం. షార్జాలోని రెండేళ్ల భారతీయ బాలుడి విషయంలో అదే జరిగింది. ఇటీవల దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియంలో బుడ్డోడి పేరు మీద అతని తల్లిదండ్రులు కొన్న లాటరీ టికెట్‌కు తాజాగా జాక్‌పాట్ తగిలింది. దాంతో ఒకటికాదు రెండుకాదు ఏకంగా 1 మిలియన్ డాలర్లు(రూ.7.47కోట్లు) గెలుచుకున్నాడు.

మొదటిసారి కొన్న లాటరీ టికెటే.. రెండేళ్ల భారతీయ బాలుడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది

దుబాయ్: అదృష్టం అనేది ఎప్పుడు ఎలా తలుపుతడుతుందో చెప్పలేం. షార్జాలోని రెండేళ్ల భారతీయ బాలుడి విషయంలో అదే జరిగింది. ఇటీవల దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియంలో బుడ్డోడి పేరు మీద అతని తల్లిదండ్రులు కొన్న లాటరీ టికెట్‌కు తాజాగా జాక్‌పాట్ తగిలింది. దాంతో ఒకటికాదు రెండుకాదు ఏకంగా 1 మిలియన్ డాలర్లు(రూ.7.47కోట్లు) గెలుచుకున్నాడు. లాటరీ టికెట్ కొన్న మొదటిసారే వారికి ఈ జాక్‌పాట్ తగలడం విశేషం. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఎళ్లతరబడి లాటరీ టికెట్ కొనుగోలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారు చాలా మంది ఉంటారు. కానీ, రెండేళ్ల భారతీయ బాలుడి విషయంలో మాత్రం లాటరీ టికెట్ కొన్న తొలిసారినే అదృష్టం వరించింది. అంతే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసేసింది. 


వివరాల్లోకి వెళ్తే.. షార్జాలో ఉండే యోగేష్ గోల్, ధనశ్రీ బండల్‌ దంపతులకు రెండేళ్ల కశన్ యోగేష్ గోల్ అనే కుమారుడు ఉన్నాడు. రెండున్నరేళ్లుగా షార్జాలో నివాసం ఉంటున్న యోగేశ్ కుటుంబం ఇటీవల సెలవులపై స్వస్థలమైన ముంబైకి వచ్చింది. ఇక్కడ సరదాగా కొన్ని రోజులు ఉన్న తర్వాత తిరిగి షార్జాకు పయనమైంది. ఈ క్రమంలో గత నెల 25న దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం 371 సిరీస్‌లో 2023 నెంబర్‌తో కుమారుడి పేరుపై ఓ లాటరీ టికెట్ కొన్నారు. యోగేష్ లాటరీ టికెట్ కొనడం కూడా ఇదే మొదటిసారి. అలా వారు తొలిసారి కొన్న లాటరీ టికెటే వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దాంతో ఏకంగా రూ.7.47కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఈ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాము ఇంత భారీ మొత్తం గెలుచుకున్నామంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని, తన కుమారుడి భవిష్యత్ భద్రమైందని తల్లి ధనశ్రీ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వహకులకు యోగేష్ ఫ్యామిలీ ధన్యవాదాలు తెలియజేసింది. కాగా, 1999లో మిలీనియం మిలియనీర్ లాటరీ ప్రారంభమైనప్పటి నుండి 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న 184వ భారతీయుడు యోగేష్.

Updated Date - 2021-10-21T16:12:56+05:30 IST