కొత్తగూడలో రెండిళ్లు దగ్ధం

ABN , First Publish Date - 2022-01-23T05:46:57+05:30 IST

మండలంలోని కొత్తగూడ గ్రామంలో శని వారం అన్నదమ్ముళ్లు కాలె రాంచందర్‌, కాలె శంకర్‌ చెందిన రెండిళ్లు అగ్ని ప్ర మాదంలో పూర్తిగా కాలిపోయాయి.

కొత్తగూడలో రెండిళ్లు దగ్ధం


బజార్‌హత్నూర్‌, జనవరి22 : మండలంలోని కొత్తగూడ గ్రామంలో శని వారం అన్నదమ్ముళ్లు కాలె రాంచందర్‌, కాలె శంకర్‌ చెందిన రెండిళ్లు అగ్ని ప్ర మాదంలో పూర్తిగా కాలిపోయాయి. ఉదయం సమయంలో కుటుంబ సభ్యు లందరూ పనులు ముగించుకుని చేన్లోకి వెళ్లారు. సాయంత్రం సమయంలో ఇళ్ల నుంచి మంటలు, పొగ వస్తున్నట్లు చుట్టుపక్కల వారు సమాచారం అందిం చడంతో వారికి హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్రామస్థులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలి తం లేకుండా పోయింది. పత్తి, సోయా పంటలు అమ్మిన డబ్బులు, కొంత బం గారం, నిత్యావసర వస్తువులు, ఆహారధాన్యాలు, టీవీ ఫ్రిజ్‌ మొదలగు వస్తువు లు పూర్తిగా కాలి బూడిదయ్యాయని బాధితులు వాపోయారు. రూ.5 లక్షల నష్ట వాటిళ్లినట్లు రెవెన్యూ అధికారులకు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విలపించారు. ఇంటిని గిర్దావర్‌ మురళీధర్‌, అనిష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:46:57+05:30 IST