అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

ABN , First Publish Date - 2021-07-10T22:40:49+05:30 IST

జమ్మూకశ్మీ‌ర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా క్వారిగామ్, రాణిపోరలో భద్రతా బలగాలకు..

అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

అనంతనాగ్: జమ్మూకశ్మీ‌ర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా క్వారిగామ్, రాణిపొరాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య శనివారంనాడు ఎన్‌కౌంటర్ చేటుచేసుకుంది. ఈ ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎన్‌కౌంటర్‌, గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. క్వారిగామ్, రాణిపొరాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకోగా, భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నట్టు అధికారిక ట్విట్టర్‌లో కశ్మీర్ జోన్ పోలీసులు పేర్కొన్నారు. రెండ్రోజుల క్రితం రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్న అనంతరం తాజా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. రాజౌరి ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. రెండు ఏకే-47 రైఫిళ్లు, భారీ మొత్తంలో ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు జమ్మ డిఫెన్స్ పీఆర్ఓ తెలిపారు.

Updated Date - 2021-07-10T22:40:49+05:30 IST