Awantipora encounter...ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2022-05-31T14:01:55+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని అవంతిపోరా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు....

Awantipora encounter...ఇద్దరు ఉగ్రవాదుల హతం

2 ఏకే-47 రైఫిల్స్ స్వాధీనం 

అవంతిపోరా : జమ్మూకశ్మీర్‌లోని అవంతిపోరా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటన స్థలంలో పోలీసులు రెండు ఏకే-47 రైఫిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.హతమైన ఉగ్రవాదులను ట్రాల్‌కు చెందిన షాహిద్ రాథర్, షోపియాన్‌కు చెందిన ఉమర్ యూసుఫ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హతులు పలు ఉగ్రవాద నేరాలతో పాటు, షాహిద్ అరిపాల్‌కు చెందిన షకీలా అనే మహిళను,  లుర్గామ్ ట్రాల్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి జావిద్ అహ్మద్‌ను హత్య చేశాడరి కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్ చేశారు.పుల్వామాలోని గుండిపురలో సోమవారం జరిగిన  ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు.ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర అవంతిపోరా ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలతో కలిసి గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.


Updated Date - 2022-05-31T14:01:55+05:30 IST