జమ్మూకశ్మీర్‌లో మరో encounter...ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2022-04-12T12:42:11+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు...

జమ్మూకశ్మీర్‌లో మరో encounter...ఇద్దరు ఉగ్రవాదుల హతం

కుల్గాం: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒక పాకిస్తాన్ ఉగ్రవాది ఉన్నాడు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలోని ఖుర్బత్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. ఎదురుకాల్పుల్లో గాయపడిన ఇద్దరు పోలీసులను ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతుందని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ ఒక ట్వీట్‌లో తెలిపారు. 


Updated Date - 2022-04-12T12:42:11+05:30 IST