ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు మెడికోలు మృతి

ABN , First Publish Date - 2020-04-07T13:57:53+05:30 IST

ఫిలిప్పీన్స్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి చెందారు.

ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు మెడికోలు మృతి

అనంతపురం వైద్యం/కదిరి, ఏప్రిల్‌ 6: ఫిలిప్పీన్స్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి చెందారు. అనంతపురానికి చెందిన కొండిగళ్ల పెద్దింటి వంశీ(21),  కదిరికి చెందిన కటికెల రేవంత్‌ కుమార్‌ (21)ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో అక్కడ కూడా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. సోమవారం ఉదయం నిత్యావసర వస్తువులు కొనడానికి ఇద్దరూ బైక్‌పై వస్తుండగా..ఫ్లైఓవర్‌ వద్ద స్తంభానికి ఢీ కొని పై నుంచి కిందపడ్డారు. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 

Updated Date - 2020-04-07T13:57:53+05:30 IST