అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణవాసుల దుర్మరణం
ABN , First Publish Date - 2022-04-24T13:02:41+05:30 IST
అమెరికాలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అలెగ్జాండర్ కౌంటీ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. మృతులు.. ఖమ్మం జిల్లా ఏన్కురు మండలం జన్నారం గ్రామానికి చెందిన స్వర్ణ పవన్ (23), హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన పీచెట్టి వంశీకృష్ణ. స్వర్ణ పవన్ 2021 ఆగస్టులో..
ఖమ్మం క్రైం, ఏప్రిల్ 23: అమెరికాలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అలెగ్జాండర్ కౌంటీ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. మృతులు.. ఖమ్మం జిల్లా ఏన్కురు మండలం జన్నారం గ్రామానికి చెందిన స్వర్ణ పవన్ (23), హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన పీచెట్టి వంశీకృష్ణ. స్వర్ణ పవన్ 2021 ఆగస్టులో ఇల్లియాస్ యునివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లారు. ఈనెల 21న ఇల్లియాస్ యూనివర్సిటీకి కారులో తన స్నేహితులతో కలిసి వెళ్లి తిరిగి వస్తుండగా రాంగ్రూట్లో దూసుకొచ్చిన మరో కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న పవన్, పక్కన కూర్చున్న ఆయన స్నేహితుడు వంశీకృష్ణ అక్కడిక్కడే మృతి చెందారు. వీరితో పాటు కారులో ఉన్న స్నేహితులు యస్వంత్, కార్తీక్, కళ్యాణ్ కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి పవన్ మృతదేహాన్ని ఆయన సోదరికి అప్పగించారు. మృతదేహం సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్కు చేరుకుంటుందని, అక్కడి నుంచి జన్నారానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.