జాతి పేరుతో విద్యార్థులను ధూషించిన వ్యవహారం.. ఇద్దరు ప్రభుత్వ టీచర్ల సస్పెన్షన్
ABN , First Publish Date - 2022-06-17T15:05:08+05:30 IST
తూత్తుకుడి జిల్లా విలాత్తికుళంలో విద్యార్థులను జాతి పేరిట ధూషించిన వ్యవహారంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. కుళత్తూర్
పెరంబూర్(చెన్నై), జూన్ 16: తూత్తుకుడి జిల్లా విలాత్తికుళంలో విద్యార్థులను జాతి పేరిట ధూషించిన వ్యవహారంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. కుళత్తూర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయురాలు కలైసెల్వి, గణితం ఉపాధ్యాయురాలు మీనా, అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను జాతి పేరిట ధూషించిన ఆడియో ఇటీవల వెలువడింది. ఈ వ్యవహారంపై స్పందించిన జిల్లా ప్రధాన విద్యాధికారి ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.