విజయనగరం జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్
ABN , First Publish Date - 2022-02-17T01:52:54+05:30 IST
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు
విజయనగరం: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై కలెక్టర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు ఉపాధ్యాయులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆ ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానోపాధ్యాయుడు సిరికి స్వామినాయుడు, టీచర్ యడ్ల సూర్యనారాయణపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.